ఒక్క చాన్సుతో రాష్ట్రం అధోగతి పాలు

ABN , First Publish Date - 2022-05-27T04:59:39+05:30 IST

ఒక్క చాన్సుతో రాష్ట్రం అధోగతి పాలు చేసి ప్రజల నడ్డి విరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్ర భుత్వానికి త్వరలోనే చమరగీతం పాడాలని టీడీపీ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మేల్యే దొమ్మలపాటి రమేష్‌ పేర్కొన్నారు.

ఒక్క చాన్సుతో రాష్ట్రం అధోగతి పాలు
దొమ్మలపాటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన సింగంవారిపల్లెలో ప్రజలు


 మాజీ ఎమ్మేల్యే దొమ్మలపాటి రమేష్‌

నిమ్మనపల్లె, మే 26: ఒక్క చాన్సుతో రాష్ట్రం అధోగతి పాలు చేసి ప్రజల నడ్డి విరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్ర భుత్వానికి త్వరలోనే చమరగీతం పాడాలని టీడీపీ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మేల్యే దొమ్మలపాటి రమేష్‌ పేర్కొన్నారు. గురు వారం నాగులయ్యగారి పల్లె, సింగంవారిపల్లెలో వైఎస్‌ఆర్‌ పార్టీ నుంచి హమీద్‌ ఆధ్వర్యంలో 100 మంది కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే కరెంట్‌, పెట్రోల్‌, డీజిల్‌, ఇసుక, స్టీల్‌, గ్యాస్‌ తదితర వాటిపై రేట్లు పెంచారన్నారు.  ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వైసీపీ పెంచిన చార్జీలపై వివరించారు. ఏపీని అప్పుల ఊభినుంచి బయట పడడానికి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అలాగే నాగులయ్మగారిపల్లె, సింగంవారిపల్లెల్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బీసీసెల్‌ అధికార ప్రతినిధి లక్ష్మన్న, మునిరత్నం, మురళి, రామచంద్ర, భూపతి విజయ్‌, చంద్ర, గోపి, నరేంద్ర, జయరాం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-27T04:59:39+05:30 IST