విద్యుదాఘాతంతో..

ABN , First Publish Date - 2022-07-04T05:46:46+05:30 IST

విద్యుదాఘాతంతో..

విద్యుదాఘాతంతో..

శంకర్‌పల్లి, జూలై 3: చెట్లకొమ్మలు నరికేందుకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన లక్ష్మణ్‌(35) కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో కరెంట్‌తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని గ్రామపంచాయతీ వాటర్‌మెన్‌ అజీమ్‌ చెప్పడంతో లక్ష్మణ్‌  అక్కడికి వెళ్లాడు. చెట్టుకొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌ తగిలింది. దీంతో లక్ష్మణ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య లలిత, ఇద్దరు కూతుళ్లు మౌనిక, రాధిక ఉన్నారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో మృతుడి భార్య, పిల్లలు రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-04T05:46:46+05:30 IST