కోహ్లీ వాళ్ల బౌలింగ్ ఆడాల్సింది.. అతనూ ఎంజాయ్ చేసేవాడు: అక్తర్
ABN , First Publish Date - 2020-05-26T18:18:04+05:30 IST
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం విరాట్ తనకి మంచి మిత్రుడు
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం విరాట్ తనకి మంచి మిత్రుడు అయ్యేవాడని అక్తర్ అన్న విషయం తెలిసిందే. సంజయ్ మంజ్రేకర్తో జరిగిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం పంజాబీలము. మా స్వభావాలు సులభంగా కలుస్తాయి. మేము బయట మంచి మిత్రులం. కానీ, మైదానంలో మాత్రం గొప్ప శత్రువులం’’ అని ఆయన అన్నారు.
అంతేకాక.. విరాట్ కోహ్లీ వసీం, వకార్, వార్న్ వంటి బౌలర్ల బౌలింగ్ ఆడాల్సిందని ఆయన అన్నారు. ‘‘అతను(విరాట్) వసీం అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్ వంటి వాళ్ల బౌలింగ్లో ఆడాల్సింది. వాళ్ల బౌలింగ్లో విరాట్ కూడా ఎంజాయ్ చేసేవాడు’’ అని అక్తర్ తెలిపారు.