క్రీడల్లో గెలుపోటములు సహజం
ABN , First Publish Date - 2021-04-19T04:19:40+05:30 IST
క్రీడల్లో గెలుపోటములు సహజం
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి
కందుకూరు : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి చేయుతనందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో ఆరు రోజులపాటు నిర్వహించిన బీపీఎల్ సీజన్-3 క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆదివారం ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మూల హన్మంత్రెడ్డి, సర్పంచ్ యాలాల శ్రీనివాస్, ఎంపీటీసీ సురేష్, వార్డుసభ్యులు రాఘవేందర్, నర్సింహ, కృష్ణ, మద్దెల రమేష్, ఎం.సంతోష్, మల్లేష్, నిర్వాహకులు, త దితరులు పాల్గొన్నారు.