శంషాబాద్లో 35 Wines shops
ABN , First Publish Date - 2021-11-10T17:18:44+05:30 IST
శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్పరిధిలో 35 వైన్షాపులకు నోటిఫికేషన్ జారీ చేశామని శంషాబాద్ డివిజన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా
హైదరాబాద్/రాజేంద్రనగర్: శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్పరిధిలో 35 వైన్షాపులకు నోటిఫికేషన్ జారీ చేశామని శంషాబాద్ డివిజన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిఽధిలో 35 వైన్షాపులను నోటిఫై చేశామన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిఽధిలో 12, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధిలో 5, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 5, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో 5, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 7, పాలమాకుల గ్రామంలో 1, కవెలిగూడ ఎక్స్రోడ్లో 1 ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. శంషాబాద్ స్టేషన్ పరిధిలో ఒక వైన్షాపు గౌడ్లకు, ఒకటి ఎస్సీలకు కేటాయించామని, ఒక వ్యక్తి ఒక వైన్షాపుకంటే ఎక్కువ దరఖాస్తులు వేసే వీలుందని, ఒకటికంటే ఎక్కువ లైసెన్స్లు పొందే వీలుందన్నారు. వైన్షాపులకు దరఖాస్తులు ఈనెల 9 నుంచి 18 వరకు స్వీకరిస్తామని, 20వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో వైన్షాపులు కేటాయించనున్నట్టు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వైన్షాపులకు సంబంఽధించిన దరఖాస్తులు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో తీసుకోనున్నట్టు చెప్పారు.