ఈదురుగాలల బీభత్సం

ABN , First Publish Date - 2021-04-17T04:51:40+05:30 IST

మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

ఈదురుగాలల బీభత్సం
బంగారుమెట్టలో నేలరాలిన మామిడి కాయలు

నేలరాలిన మామిడి కాయలు

దెబ్బతిన్న అరటి తోటలు


బుచ్చెయ్యపేట, ఏప్రిల్‌ 16: మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో అకస్మాత్తుగా పెను గాలులు వీచాయి. గాలులతో పాటు కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ వైర్లపై పడిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. అరటి తోటలు, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. విజయరామరాజుపేట జడ్పీ హైస్కూల్‌లో భవనం పైకప్పు రేకుల ఎగిరిపడ్డాయి. బంగారుమెట్ట, లోపూడి, పి.భీమవరం, వడ్డాది, ఎల్‌.సింగవరం, కొండెంపూడి, చినఅప్పన్నపాలెం తదితర గ్రామాల్లో మామిడికాయలు నేల రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 


Updated Date - 2021-04-17T04:51:40+05:30 IST