రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2022-07-07T05:25:21+05:30 IST
కార్మికుల సమస్యల పరిష్కారానికై జరుగు రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు.
బద్వేలు, జూలై 6 : కార్మికుల సమస్యల పరిష్కారానికై జరుగు రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మల్లికార్జున సంయుక్తంగా మాట్లాడుతూ 11వ తేదీ జరిగే రాష్ట్రవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెకు అన్ని రాజకీయ, ప్రజాసంఘాలు, ఉద్యోగ, మేథావులు, వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు నాగేష్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సీఐటీయూ సీనియర్ నాయకులు ఖాదర్ హుసేన్ పాల్గొన్నారు.