‘మార్కెట్’ ఉత్సాహం కొనసాగేనా ?
ABN , First Publish Date - 2021-01-21T22:54:52+05:30 IST
దూకుడు మీదున్న ఫైనాన్షియల్ మార్కెట్ల పొంగు ఎంతవరకన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నేనని ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లా పేర్కొన్నారు. ఇదే ఉత్సాహం కొనసాగుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కనీసం మరో మూడు నెలలైనా వేచి చూడాల్సి ఉంటుందన్నారు.
న్యూఢిల్లీ : దూకుడు మీదున్న ఫైనాన్షియల్ మార్కెట్ల పొంగు ఎంతవరకన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నేనని ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమారమంగళం బిర్లా పేర్కొన్నారు. ఇదే ఉత్సాహం కొనసాగుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కనీసం మరో మూడు నెలలైనా వేచి చూడాల్సి ఉంటుందన్నారు.
నిరుడు కరోనా మహమ్మారి ఎంతో నష్టానికి కారణమైందని బిర్లా వ్యాఖ్యానించారు.
ఇక ‘వర్క్ ఫ్రమ్ హం’ను ఎక్కువ మంది సమర్థిస్తున్న తరుణంలో.. కార్యాలయ ప్రాధాన్యం గురించి బిర్లా మాట్లాడారు. కార్యాలయమన్నది ఉద్యోగులు వచ్చి పనిచేసే కేవలం ఒక స్థలం మాత్రమే కాదని, ప్రజలు, ఆలోచనలు, సంభాషణలన్నింటినీ కలిపి, కరిగించి, ఫలితాన్ని వెలికితీసే వేదిక అని పేర్కొన్నారు.