వైస్ ఎంపీపీ తీరును మంత్రి దృష్టికి తీసుకెళ్తా
ABN , First Publish Date - 2022-01-29T05:10:15+05:30 IST
వైస్ ఎంపీపీ తీరును మంత్రి దృష్టికి తీసుకెళ్తా
మేడ్చల్, జనవరి 28 : ప్రొటోకాల్ పాటించకుండా అవమానాలకు గురిచేస్తున్న మేడ్చల్ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు వీర్లపల్లి రజితారాజమల్లారెడ్డి తీరును మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీపీ పద్మజగన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మేడ్చల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైస్ ఎంపీపీతో పాటు వివిధ హోదాల్లో సర్పంచ్గా, వార్డుసభ్యుడిగా, కాంట్రాక్టర్గా, రాజకీయ నాయకులుగా కొనసాగుతున్న ఆమె కుటుంబ సభ్యులు మండలంలో గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీలోని కార్యకర్తలు, నాయకులను అయోమయానికి గురిచేస్తున్నారని వాపోయారు. ఒకే కుటుంబంలో ఉన్న వారికి ఇన్ని పదవులు ఉన్నప్పటికీ, వారు కావాలనే తనను అవమానానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డిలకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైస్ ఎంపీపీ తీరుపై పార్టీలోని కార్యకర్తలు, నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.