లాక్డౌన్ తర్వాతే వైఫల్యాలపై మాట్లాడదాం: పవన్
ABN , First Publish Date - 2020-04-10T07:22:53+05:30 IST
లాక్డౌన్ తర్వాతే రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడదామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో...
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ తర్వాతే రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడదామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘కరోనా సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్డౌన్ పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధాని మోదీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలో ప్రణాళిక అమలు చేద్దాం’ అని పవన్ తెలిపారు.