లతామంగేష్కర్‌ స్మారకార్థం పోస్టల్ స్టాంప్.. కేంద్రం నిర్ణయం

ABN , First Publish Date - 2022-02-07T22:43:34+05:30 IST

గాయని లతామంగేష్కర్ స్మారకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రైల్వే..

లతామంగేష్కర్‌ స్మారకార్థం పోస్టల్ స్టాంప్.. కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: గాయని లతామంగేష్కర్ స్మారకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రైల్వే, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘ఇండియా టుడే’ బడ్జెట్ రౌండ్ టేబుల్‌లో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’కు అదే సరైన గౌరవమని అన్నారు.


వివిధ రంగాలకు చెందిన ప్రముఖమైన వ్యక్తులు, ప్రకృతి విషయాలు, అందమైన, అరుదైన జంతు, వృక్షజాలం, వ్యవసాయ సంబంధ కార్యకాలాపాలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు తదితర వాటిపై తపాలా శాఖ స్మారక తపాలా బిల్లలు విడుదల చేస్తూ ఉంటుంది. ఇవి పోస్టల్ డిపాజిట్ అకౌంట్ స్కీం కింద తపాలా బిళ్లల బ్యూరో, కౌంటర్లలో లభిస్తాయి. వీటిని కొద్ది మొత్తంలోనే ముద్రిస్తారు.

Updated Date - 2022-02-07T22:43:34+05:30 IST