India vs Sri Lanka: గాయంతో సైనీ అవుట్.. సాయి కిషోర్ ఇన్!
ABN , First Publish Date - 2021-07-29T21:38:19+05:30 IST
శ్రీలంకతో నిన్న జరిగిన రెండో టీ20లో గాయపడిన నవదీప్ సైనీ బీసీసీఐ వైద్య బృందం అబ్జర్వేషన్లో
కొలంబో: శ్రీలంకతో నిన్న జరిగిన రెండో టీ20లో గాయపడిన నవదీప్ సైనీ బీసీసీఐ వైద్య బృందం అబ్జర్వేషన్లో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్లో ఎక్స్ట్రా-కవర్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. కరుణరత్నె కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి పట్టుకునే ప్రయత్నంలో సైనీ బలంగా కిందపడ్డాడు. దీంతో అతడి భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం అతడిని మైదానం నుంచి తీసుకెళ్లి చికిత్స అందించింది. గాయం తీవ్రంగా ఉండడంతో నేటి నిర్ణయాత్మక మ్యాచ్లో ఆడే అవకాశం లేనట్టే. దీంతో అతడి స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్కు చాన్స్ దక్కే అవకాశం ఉంది. అలాగే, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ కూడా రేసులో ఉన్నాడు. అయితే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది కాబట్టి సాయి కిషోర్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.