ముఖేష్ అంబానీ చేతికి పబ్జీ..?
ABN , First Publish Date - 2020-09-21T23:33:09+05:30 IST
మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్జీ భారత్లో నిషేధాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... పబ్జీ త్వరలోనే రిలయన్స్ జియో గేమ్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా సంస్థ... ‘యూనిట్ పబ్జీ ’భారత్లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ముంబై : మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్జీ భారత్లో నిషేధాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... పబ్జీ త్వరలోనే రిలయన్స్ జియో గేమ్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా సంస్థ... ‘యూనిట్ పబ్జీ ’భారత్లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో... ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోతో జట్టు కట్టవచ్చునని వినవస్తోంది. దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన మల్టీప్లేయర్ గేమ్ భారత మార్కెట్ లో ప్రస్తుతం నిషేధంలో ఉంది. రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతన్నాయని సమాచారం. దీనిపై పబ్జీ, రిలయన్స్ సంస్థల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.