చైనా సరిహద్దులో ఇంచు భూమిని నష్టపోనివ్వం: కొత్త ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మనోజో పాండే

ABN , First Publish Date - 2022-05-02T00:35:42+05:30 IST

న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దు వెంబడి ఇంచు భూమిని కూడా కోల్పోనివ్వబోమని భారత నూతన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టనెంట్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు.

చైనా సరిహద్దులో ఇంచు భూమిని నష్టపోనివ్వం: కొత్త ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మనోజో పాండే

న్యూఢిల్లీ : India- china సరిహద్దు వెంబడి ఇంచు భూమిని కూడా కోల్పోనివ్వబోమని భారత new Army chief Of staff,  Lt Gen Manoj Pande వ్యాఖ్యానించారు. సరిహద్దు వెంబడి యథాతథ స్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదని చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. భౌగోళికంగా అత్యంత కీలకమైన  ప్రాంతాల్లో భారత దళాలు మోహరించివున్నాయని తెలిపారు. భారత విరోధులు యథాస్థితిని మార్చేందుకు ఏకపక్ష, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కీలకమైన ప్రాంతాల్లో అదనపు బలగాలతోపాటు ఆయుధాలు కూడా మోహరించి ఉన్నాయని ప్రకటించారు. రవాణా, ఆపరేషన్ అవసరాలకు ముఖ్యమైన మౌలికవసతులు మరింత పెంపుపై ద‌ృష్టిసారించామని చెప్పారు. భారత్, చైనాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఓ మీడియా సంస్థతో ఆయన ఆదివారం మాట్లాడారు.

Updated Date - 2022-05-02T00:35:42+05:30 IST