తప్పుడు కేసులు పెట్టే పోలీసులను వదిలి పెట్టం: Chandra Babu

ABN , First Publish Date - 2022-07-02T00:23:39+05:30 IST

అమరావతి: సీఐడీ చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సుప్రీం కోర్టు నిబంధనలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఎన్నో

తప్పుడు కేసులు పెట్టే పోలీసులను వదిలి పెట్టం: Chandra Babu

అమరావతి: సీఐడీ పోలీసుల చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సుప్రీం కోర్టు నిబంధనలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వానికి  సిగ్గు ఎగ్గు లేవన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులు అయిన వెంకటేష్, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని పేర్కొన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తప్పుడు కేసులు బనాయించే అధికారులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. 


కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం గుండెల మీద తన్నారు.

చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్సులో సోషల్ మీడియా యాక్టివిస్టు సాంబశివరావు తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించాడు. ‘‘నా ఇంటికి సీఐడీ పోలీసులు వచ్చి దుర్భాషలాడారు. బెడ్ రూంలోకి వచ్చి అరెస్ట్ చేశారు. స్టేషనుకు తీసుకెళ్లి బట్టలిప్పించారు. నన్ను చిత్రహింసలకు గురి చేశారు.కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం గుండెల మీద తన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని బెదిరించారు. 41ఏ నోటీసు ఇచ్చారు.. బయటకు పంపుతూ.. విచారణ జరుగుతోందని చెప్పమన్నారు. పెద్దొళ్లతో పెట్టుకుంటున్నావ్.. మేం కొట్టినట్టు బయట చెబితే మళ్లీ కేసులు పెడతామని హెచ్చరించారు.’’ అని సాంబశివరావు చెప్పాడు. 

Updated Date - 2022-07-02T00:23:39+05:30 IST