ఎప్పుడైనా అందుబాటులో ఉంటా
ABN , First Publish Date - 2020-04-10T09:20:49+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా బయట తిరగవద్దని అందరూ ఇంటికే పరిమితం
ఫోన్ చేస్తే నిత్యావసర వస్తువులు మీ ఇంటి వద్దకే : ఎస్పీ అన్బురాజన్
కడప (క్రైం), ఏప్రిల్ 9 : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా బయట తిరగవద్దని అందరూ ఇంటికే పరిమితం కావాలని, నిరంతరం పోలీసుశాఖ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్-19 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరుకు సమాచారం ఇస్తే నేరుగా మీ ఇంటికే నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తామని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు.
నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు, వైద్య సేవలు అవసరమైన వారు 08562-245259, 08562-259179కు ఫోను చేసి సమాచారం అందించాలని కోరారు. అలాగే ఎవరైనా అధిక ధరలకు నిత్యావసరాలు, సరుకులు విక్రయిస్తుంటే ఈ నెంబర్లకు ఫోను చేసి సమాచారం అందిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.