భర్తను కొడవలితో నరికి చంపిన భార్య

ABN , First Publish Date - 2020-07-09T10:44:26+05:30 IST

రెబ్బెన మండలం రోళ్లపాడు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చింతకుంట శ్రీనివాస్‌(34) అనే యువకుడిని ..

భర్తను కొడవలితో నరికి చంపిన భార్య

రెబ్బెన, జూలై8: రెబ్బెన మండలం రోళ్లపాడు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున  చింతకుంట శ్రీనివాస్‌(34) అనే యువకుడిని అతని భార్య అంజలి అలియాస్‌ స్వప్న అత్యంత దారుణంగా కొడవలితో నరికి చంపింది. రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం రోళ్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, అంజలి దంపతులు గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఏడు సంవత్సరాల కుమారుడు, ఐదు సంవత్సరాల కూతురు ఉన్నారు. వీరితోనే శ్రీనివాస్‌ తండ్రి పోచయ్య కూడా ఉంటున్నాడు. అయితే దంపతులిద్దరూ మద్యానికి బానిసయ్యారు.


మంగళవారం పోచయ్యకు వృద్ధాప్య పెన్షన్‌ రాగా అతని వద్ద నుంచి కుమారుడు శ్రీనివాస్‌ రూ.600 తీసుకుని ఖర్చు చేశాడు. అదే రోజు సాయంత్రం పెన్షన్‌ డబ్బుల విషయంలో శ్రీనివాస్‌, అంజలి మధ్య వివాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొడుకు అరుపులు వినిపించడంతో పోచయ్య వెళ్లి చూశాడు. అంజలి కొడవలితో శ్రీనివాస్‌ను నరకడం గమనించిన పోచయ్య కేకలు వేయడంతో ఆమె పారిపోయింది. పోచయ్య దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెబ్బెన సీఐ ఆకుల అశోక్‌ తెలిపారు.  

Updated Date - 2020-07-09T10:44:26+05:30 IST