మే 18న భర్త ఆత్మహత్య.. శుక్రవారం భార్య కూడా మృతి

ABN , First Publish Date - 2020-07-04T20:15:38+05:30 IST

పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో ఓ మహిళ శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపిన వివరాల మేరకు లక్ష్మీచెన్నకేశవపురంలో లలిత కుమారి(44) నివాసముంటోంది. ఈమె భర్త టీచర్‌ నాగరాజు మే 18వ తేదీన

మే 18న భర్త ఆత్మహత్య.. శుక్రవారం భార్య కూడా మృతి

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి


ధర్మవరం అర్బన్‌ (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో ఓ మహిళ శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పట్టణ సీఐ కరుణాకర్‌  తెలిపిన వివరాల మేరకు లక్ష్మీచెన్నకేశవపురంలో లలిత కుమారి(44) నివాసముంటోంది. ఈమె భర్త టీచర్‌ నాగరాజు మే 18వ తేదీన  ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి  నుంచి ఇంటిలో ఆమె ఒంటరిగా ఉంటోంది. అయితే ఇంటిలో ఆమె ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు గమనించి 100కు ఫోన్‌ రావడంతో తాను సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని లలితకుమారి మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతురాలి బంధువులు ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాకపోవడంతో స్థానిక వీఆర్‌ఓతో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లలితకుమారిది ఆత్మహత్య లేదా హత్య అనేది విచారణ చేపడుతామని సీఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 


Updated Date - 2020-07-04T20:15:38+05:30 IST