మద్యం తాగి భార్యను కొట్టిన భర్త.. అతడి పీడ వదిలించుకోవడానికి ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-18T08:08:32+05:30 IST

మద్యపానం అలవాటు ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతోంది. అయినా ఈ దురలవాటు నుంచి చాలా మంది తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మద్యపానం కారణంగా భార్య చేతిలోనే హతమయ్యాడు. అతను రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను...

మద్యం తాగి భార్యను కొట్టిన భర్త.. అతడి పీడ వదిలించుకోవడానికి ఆమె ఏం చేసిందంటే..

మద్యపానం అలవాటు ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతోంది. అయినా ఈ దురలవాటు నుంచి చాలా మంది తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మద్యపానం కారణంగా భార్య చేతిలోనే హతమయ్యాడు. అతను రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను కొట్టేవాడు. సహనం కోల్పోయిన భార్య మందులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి చంపేసింది. 


ఢిల్లీలోని మౌర్య ఎన్‌క్లేవ్ ప్రాంతంలో భరత్‌లాల్, లక్ష్మీదేవి దంపతులు నివసిస్తున్నారు. భరత్ ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను దారుణంగా కొట్టేవాడు. ఆ బాధ భరించలేకపోయిన లక్ష్మి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. శనివారం రాత్రి మద్యంలో సుమారు 15 నిద్రమాత్రలు కలిపి భర్త చేత తాగించింది. భర్త స్పృహ తప్పి పడిపోయిన వెంటనే పైజామాతో అతని గొంతు నులిమి చంపేసింది. అనంతరం కుమారుడి సాయంతో మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఊరికి దూరంగా పారేసింది. 


ఆదివారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. భర్త మరణం గురించి లక్ష్మీదేవిని ప్రశ్నించారు. ఆమె సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నేరం అంగీకరించింది. లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2022-04-18T08:08:32+05:30 IST