భర్త హింసిస్తున్నాడని మత్తుమందిచ్చిన భార్య.. ఆ తర్వాత కరెంట్ షాకిచ్చి..

ABN , First Publish Date - 2021-08-18T07:39:35+05:30 IST

రోజూ భర్త పెట్టే హింసలను ఆ భార్య తట్టుకోలేకపోయింది. ఇంటికి రావడం ఆలస్యం తిట్టడం, కొట్టడం. ఈ జీవితంతో విసిగిపోయిన..

భర్త హింసిస్తున్నాడని మత్తుమందిచ్చిన భార్య.. ఆ తర్వాత కరెంట్ షాకిచ్చి..

జైపూర్: రోజూ భర్త పెట్టే హింసలను ఆ భార్య తట్టుకోలేకపోయింది. ఇంటికి రావడం ఆలస్యం తిట్టడం, కొట్టడం. ఈ జీవితంతో విసిగిపోయిన ఆ భార్య ఎలాగైనా భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. అందులో భాగంగా ఓ క్రూరమైన ప్లాన్‌ వేసింది. భర్తకు మత్తుమందిచ్చి ఆ తర్వాత కరెంట్ షాకిచ్చి పగ తీర్చుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో సంచలనంగా మారింది. 


బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. దాని ప్రకారం.. మహేంద్ర దన్(32) అనే వ్యక్తి బికరీన్‌లో నివశిస్తున్నాడు. అతడి భార్యతో తరచుగా గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పని నుంచి ఇంటికి రాగానే అతడి భార్య భోజనం పెట్టింది. భోజనం చేసిన తర్వాత అతడు స్పృహ కోల్పోయాడు. అయితే తర్వాత ఎలక్ట్రిక్ షాక్ తగలడంతో మెలకువ వచ్చింది. ఎదురుగా భార్య.. చేతులకు ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని కరెంట్ షాకిస్తోంది. మహేంద్ర కాళ్లకు కరెంటు వైర్లు చుట్టి ఉన్నాయి. మెలకువ వచ్చినప్పటికీ.. వరుసగా కరెంట్ షాక్ ఇవ్వడంతో మహేంద్రన్ మళ్లీ స్పృహ కోల్పోయాడు.


రెండో రోజు తిరిగి స్పృహ వచ్చే సమయానికి మహేంద్రన్ కాళ్లు కాలిపోయి ఉన్నాయి. అతడు హాస్పిటల్ బెడ్‌పై కట్టేసి ఉన్నాడు. అతడి తండ్రి, సోదరుడు తన వద్ద ఉన్నారు. ఏమని అడిగితే.. అర్థ రాత్రి 2 గంటల సమయంలో మహేంద్రన్‌కు కరెంట్ షాక్ తగిలిందంటూ అతడి భార్యే వారికి ఫోన్ చేసి పిలిపించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు మహేంద్ర మొత్తం వివరాలను చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు  చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేంద్రన్‌కు బికనీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-18T07:39:35+05:30 IST