ఇంట్లో భార్య లేకపోవడంతో వెతుక్కుంటూ తోటలోకి వెళ్లిన భర్త.. అక్కడ కనిపించిన షాకింగ్ సీన్ చూసి..

ABN , First Publish Date - 2022-06-09T09:50:20+05:30 IST

సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి ఇంటికొచ్చాడతను. ఇంట్లో భార్య లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. పిల్లలను అడిగితే వాళ్లు కూడా తెలియదన్నారు. దాంతో ఎక్కడకు వెళ్లిందా? అనుకుంటూ ఇంటి వెనుక ఉన్న తోటలోకి వచ్చాడు. అక్కడ 63 ఏళ్ల వ్యక్తితో అసభ్య స్థితిలో ఉన్న భార్యను చూసి కోపం ఆపుకోలేకపోయాడు. ఆమె వెంటనే పక్కకు వచ్చి ఆ వృద్ధుడే బలవంతం చేశాడని చెప్పింది. దాంతో మెడలో ఉన్న తువ్వాలును వృద్ధుడి మెడకు చుట్టి హత్య చేశారు...

ఇంట్లో భార్య లేకపోవడంతో వెతుక్కుంటూ తోటలోకి వెళ్లిన భర్త.. అక్కడ కనిపించిన షాకింగ్ సీన్ చూసి..

సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి ఇంటికొచ్చాడతను. ఇంట్లో భార్య లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. పిల్లలను అడిగితే వాళ్లు కూడా తెలియదన్నారు. దాంతో ఎక్కడకు వెళ్లిందా? అనుకుంటూ ఇంటి వెనుక ఉన్న తోటలోకి వచ్చాడు. అక్కడ 63 ఏళ్ల వ్యక్తితో అసభ్య స్థితిలో ఉన్న భార్యను చూసి కోపం ఆపుకోలేకపోయాడు. ఆమె వెంటనే పక్కకు వచ్చి ఆ వృద్ధుడే బలవంతం చేశాడని చెప్పింది. దాంతో మెడలో ఉన్న తువ్వాలును వృద్ధుడి మెడకు చుట్టి హత్య చేశారు ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి. ఆ తర్వాత శవాన్ని దూరంగా తీసుకెళ్లి పారేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రీవా ప్రాంతంలో వెలుగు చూసింది. 


63 ఏళ్ల రాజ్‌కుమార్ మిశ్రా అనే వ్యక్తి.. ఆరోగ్య శాఖలో కార్మికుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అదే ఊళ్లోని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వాళ్లిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండగా మహిళ భర్త కంటపడ్డారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి మిశ్రాను హత్య చేసి శవాన్ని ఇంటికి దూరంగా పడేశారు. ముందుగా మృతదేహాన్ని చూసిన పోలీసులు.. హార్ట్ ఎటాక్ ఏమో అనుకున్నారు. కానీ పోస్టుమార్టంలో హత్య అని తేలడంతో.. దర్యాప్తు చేశారు. 


చివరగా ఆ వృద్ధుడు సదరు మహిళతో మాట్లాడినట్లు తెలిసి వాళ్లను విచారణ చేశారు. విచారణ సందర్భంగా మహిళ భర్త వాంగ్మూలం మారుస్తూ ఉండటంతో మరింత గట్టిగా ప్రశ్నించారు. దాంతో అసలు నిజం చెప్పేశాడతను. దీంతో భార్యాభర్తలిద్దరిపైనా కేసు నమోదు చేసిన అధికారులు.. వాళ్లను అరెస్టు చేశారు.


Updated Date - 2022-06-09T09:50:20+05:30 IST