భార్యపై భర్త రోకలి బండతో దాడి

ABN , First Publish Date - 2021-04-17T05:19:19+05:30 IST

తన కుమార్తెను ఎందుకు బాధపెడుతున్నావని అడిగిన తండ్రిపై అల్లుడు రోకలి బండతో దాడిచేశాడు. ఈ ఘటన పట్టణంలోని బాదుల్లావారి వీధి లో జరిగింది.

భార్యపై భర్త రోకలి బండతో దాడి
చికిత్స పొందుతున్న సంధ్యారాణి

నిలదీసిన మామ, బావమరిదిపైనా...

కేసు నమోదు చేసిన పోలీసులు 

కనిగిరి, ఏప్రిల్‌ 16 : తన కుమార్తెను ఎందుకు బాధపెడుతున్నావని అడిగిన తండ్రిపై అల్లుడు రోకలి బండతో దాడిచేశాడు. ఈ ఘటన పట్టణంలోని బాదుల్లావారి వీధి లో జరిగింది. మామతో పాటు బావమరిదిపైనా దాడి చేశా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన యాదగిరి నాగేశ్వరరావు కుమార్తె సంద్యారాణికి, హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన పొదిలి నాగార్జునతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక రెండేళ్ల పాప ఉంది. వీరిద్దరు కూడా ప్రస్తుతం కనిగిరిలోని బాదుల్లావారి వీధిలో ఉంటున్నారు. పెళ్లి జరిగిన నాటి నుంచి సంద్యారాణిని భర్త సహా అత్తింటివారు హింసలకు గురిచేస్తున్నారు. ఈ విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నడిచాయి.  అయినా నాగార్జున ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని తన కూతుర్ని పదేపదే కొడుతూ మానసికంగా, హింసలకు గురిచేశాడని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కుమార్తె సంద్యారాణిని అల్లుడు నాగార్జున రోకలి బండతో తలపై కొట్టాడు. విషయం తెలిసిన తండ్రి తన కుమారుడితో కలిసి కుమార్తె ఇంటికి వెళ్లాడు. అప్పటికే సంద్యారాణి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వారు నాగార్జునను నిలదీయడంతో ఆగ్రహించి వారిద్దరిపైనా దాడి చేశాడు. నాగార్జున అన్నలు కొండలరావు, వెంకటేశ్వర్లు కూడా వీరిపై దాడి చేశారు. ఈ దాడిలో నాగేశ్వరరావు కుమారుడు యాదగిరి నవీన్‌ తలకు తీవ్ర గాయమైంది. వీరిని వైద్యశాలకు తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి చేసిన పొదిలి నాగార్జున, కొండలరావు, వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-04-17T05:19:19+05:30 IST