Wifeతో ఫోన్ చేయించి మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించిన భర్త.. కొద్దిసేపటికే..!
ABN , First Publish Date - 2021-12-16T14:52:46+05:30 IST
Wifeతో ఫోన్ చేయించి మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించిన భర్త.. కొద్దిసేపటికే..!
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : తన భార్యతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో ఆమె మాజీ ప్రియుడిపై ఓ భర్త బుధవారం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రవి తెలిపిన వివరాల ప్రకారం... ఇందిరానగర్లో నివాసముండే మనోజ్ (21) ఎనిమిది నెలల క్రితం దివ్య (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు దివ్య కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి భానుప్రకాష్ శర్మను ప్రేమించింది. తనతో వివాహం జరిగిన తరువాత కూడా భాను ప్రకాష్ శర్మతో దివ్య మాట్లాడుతున్నట్లు మనోజ్ అనుమానం పెంచుకున్నాడు.
బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో దివ్యతో భానుప్రకాష్కు ఫోన్చేయించి ఇంటికి పిలిపించాడు. వారి మధ్య కొద్దిసేపు వాదులాట జరిగింది. కోపంతో మనోజ్ అద్దం (సీసం) పెంకును తీసుకొని భానుప్రకాష్ శర్మ కడుపులో పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో బాధితుడ్ని చికిత్సకోసం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. మనోజ్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శర్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.