Crime: భార్య గొంతు కోసి చంపేసిన భర్త.. కారణమేంటో తెలిస్తే షాక్..!

ABN , First Publish Date - 2022-07-18T02:01:21+05:30 IST

ఆ మహిళకు ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇద్దరు కూతుళ్లకు తల్లి అయింది..

Crime: భార్య గొంతు కోసి చంపేసిన భర్త.. కారణమేంటో తెలిస్తే షాక్..!

ఆ మహిళకు ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇద్దరు కూతుళ్లకు తల్లి అయింది.. అయితే కొడుకును కనలేదని భర్త, అత్త మామలు ఆమెను వేధించేవారు.. భర్త తరచుగా ఆమెపై చేయి చేసుకునే వాడు.. తాజాగా ఆమె గొంతు కోసి చంపేశాడు.. హత్య విషయాన్ని దాచి పెట్టేందుకు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.. బీహార్‌లోని కతిహార్‌లో ఈ దారుణం జరిగింది. 


ఇది కూడా చదవండి..

మొబైల్‌లో వీడియో చూసి ఉరేసుకున్న బాలుడు.. చివరి నిమిషంలో కేకలు పెట్టడంతో..


కతిహార్‌కు చెందిన మీరాదేవి (28) ఏడేళ్ల క్రితం బాబూలాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత మీరాకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. మగ బిడ్డకు జన్మనివ్వలేదని భర్తతో సహా అత్తమామలు ఆమెను తరచుగా వేధిస్తుండేవారు. భర్త ఆమెపై తరచుగా చేయి చేసుకునేవాడు. చివరకు శుక్రవారం రాత్రి మీరా గొంతు కోసి చంపేశాడు. మీరా ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు ఆమెను ఉరికి వేలాడదీశాడు. తల్లిదండ్రులు కూడా బాబూలాల్‌కు సహకరించారు. అయితే ఇరుగుపొరుగు వారు రావడంతో వారి బంఢారం బయటపడింది. 


స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మీరా మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. మీరా భర్తను హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. కాగా, హత్యకు సహకరించిన మీరా అత్తమామలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Updated Date - 2022-07-18T02:01:21+05:30 IST