కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణం

ABN , First Publish Date - 2020-05-31T00:25:17+05:30 IST

కంచికచర్లలో దారుణం జరిగింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నీలవేణి హత్యకు గురయ్యారు. భార్య నీలవేణిని భర్త నాగశేషు చీరతో..

కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణం

కృష్ణా: కంచికచర్లలో దారుణం జరిగింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నీలవేణి హత్యకు గురయ్యారు. భార్య నీలవేణిని భర్త నాగశేషు చీరతో ఉరేసి చంపేశాడు.  కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. తాజాగా మరోసారి గొడవ జరగడంతో ఆవేశంలో నాగశేషు ఈ ఘాతానికి పాల్పడ్డాడు. మృతురాలు నీలవేణి కంచికచర్ల ఎక్సైజ్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. భర్త నాగశేషును పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Updated Date - 2020-05-31T00:25:17+05:30 IST