భర్తను వదిలి ప్రియుడి వద్దకు వెళ్లిన మహిళ.. మూడేళ్లుగా ప్రియుడితో సహజీవనం.. మళ్లీ భర్త వద్దకు వెళ్లగా.. ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-15T05:51:25+05:30 IST

నలుగురు పిల్లల తల్లి అయిన ఒక మహిళ తన భర్తను వదిలి ప్రియుడి వద్దకు వెళ్లింది. అతడితో మూడేళ్లుగా సహజీవనం చేసింది. ఒకరోజు ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లిపోవాలని...

భర్తను వదిలి ప్రియుడి వద్దకు వెళ్లిన మహిళ.. మూడేళ్లుగా ప్రియుడితో సహజీవనం.. మళ్లీ భర్త వద్దకు వెళ్లగా.. ఏం జరిగిందంటే..

నలుగురు పిల్లల తల్లి అయిన ఒక మహిళ తన భర్తను వదిలి ప్రియుడి వద్దకు వెళ్లింది. అతడితో మూడేళ్లుగా సహజీవనం చేసింది. ఒకరోజు ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కానీ ఇదంతా అనుకున్నంత సులువకాదని ఆమెకు అర్థమైంది. తాను అనుకున్నది జరగడానికి ఆమె ఎంతకు తెగించిందంటే..


ఝార్ఖండ్ రాష్ట్రంలోని సెరాయ్ కేలా ప్రాంతంలో నివసించే ప్రీతమ్ బన్సియార్ అనే యవకుడు పూర్ణిమా దేవి అనే మహిళనే ప్రేమించాడు. పూర్ణిమా దేవికి నలుగురు పిల్లలున్నారు. అయినా భర్త, పిల్లలను వదిలి ప్రియుడు ప్రీతమ్‌తో పారిపోయింది. ఇద్దరూ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు పూర్ణిమా దేవికి ప్రీతమ్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తరువాత పూర్ణిమా దేవి తిరిగి భర్త, పిల్లల వద్దకే వెళ్లిపోవాలనుకుంది. కానీ అందుకు ప్రీతమ్ ఒప్పుకోలేదు. ఆమెను ఇంట్లోనే బంధించి పెట్టాడు. 


ఆ తరువాత పూర్ణిమా దేవి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేసింది. ప్రియుడితో రాజీపడినట్లు నటించింది. ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి పడుకున్నారు. అర్ధరాత్రి ప్రీతమ్ నిద్రపోయాక పూర్ణిమాదేవి మెల్లగా లేచి.. మంచం కింద దాచిన ఒక ఇనుప రాడ్‌తో ప్రీతమ్ తలపై బలంగా కొట్టింది. ప్రీతమ్ చనిపోయాక.. ఆమె అక్కడి నుంచి పారిపోయి భర్త ఇంటికి చేరుకుంది. 


ప్రీతమ్ చనిపోయాక అతని మ‌ృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేసి పూర్ణిమా దేవి గురించి తెలుసుకున్నారు. చివరకు పూర్ణిమా దేవిని ఆమె భర్త ఇంటి నుంచి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Updated Date - 2022-03-15T05:51:25+05:30 IST