Marriage అయిన 3 నెలలకే కట్టుకున్న భర్తను దారుణంగా హత్యచేసి.. మృతదేహాన్ని..!

ABN , First Publish Date - 2021-10-04T17:26:47+05:30 IST

మూడు నెలల్లోనే కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసి...

Marriage అయిన 3 నెలలకే కట్టుకున్న భర్తను దారుణంగా హత్యచేసి.. మృతదేహాన్ని..!

చెన్నై/అడయార్‌ : పుదుక్కోట జిల్లాలో వివాహమైన మూడు నెలల్లోనే కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని గాంధర్వకోట ప్రాంతానికి చెందిన పాండిదురై (30) అనే కార్మికుడికి మూడు నెలల క్రితం నందిని (30)తో వివాహం జరిగింది. అయితే, వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తింది. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన పాండిదరై కనిపించకుండా పోయాడు. దీనిపై పాండిదురై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో తమ మధ్య ఏర్పడిన గొడవల్లో కత్తితో దాడి చేయడంతో పాండిదురై చనిపోయినట్టు నందిని అంగీకరించింది. మృతదేహాన్ని ఎవరూ లేని సమయంలో ఈడ్చుకెళ్ళి పాడుబడిన బావిలో పడేసినట్టు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నందినిని అరెస్టు చేశారు.



Updated Date - 2021-10-04T17:26:47+05:30 IST