రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ... ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన భార్య ఎంతటి దారుణానికి పాల్పడిందంటే...

ABN , First Publish Date - 2022-08-02T14:27:59+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో హృదయ విదారక ఘటన...

రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ... ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన భార్య ఎంతటి దారుణానికి పాల్పడిందంటే...

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో గొడవ జరిగిన నేపధ్యంలో ఓ భార్య తన భర్తపై గొడ్డలితో దాడి చేసింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉమర్‌ఖెడలో జరిగింది. సందీప్ తన  భార్య (సంధ్య), కుమారునితో కలిసి ఉంటున్నాడు. 


రోజూ ఏదో విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి సందీప్‌కు భార్యతో  గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య తన భర్త సందీప్‌పై గొడ్డలితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఉదంతంపై మృతుడి తండ్రి రాంప్రకాష్ మాట్లాడుతూ తన కుమారుడు కుటుంబ పోషణ కోసం బస్సు నడిపేవాడని, రంగులు వేసే పని కూడా చేసేవాడని తెలిపారు. మధ్యమధ్యలో కూలీపనులకు వెళ్లేవాడన్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన కోడలు, కొడుకు మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో తన కుమారుడిపై కోడలు గొడ్డలితో దాడి చేయడంతో తన కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. మృతుడు సందీప్ కుమారుడు నైతిక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-02T14:27:59+05:30 IST