భర్తను హత్యచేసి ఫ్రిడ్జ్లో దాచిన భార్య
ABN , First Publish Date - 2021-04-03T00:07:48+05:30 IST
కార్మికనగర్లో టైలర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్తను భార్య హత్యచేసి ఫ్రిడ్జ్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: కార్మికనగర్లో టైలర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్తను భార్య హత్యచేసి ఫ్రిడ్జ్లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. టైలర్ సిద్దిఖ్ అహ్మద్ను భార్య రుబీనా హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని, అదను చూసి భర్తను హతమార్చి భార్య రుబీనా ఫ్రిడ్జ్లో దాచిపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. రుబీనాను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. కర్నాటక జిల్లా కొహిర్కు చెందిన మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్ (45) కూకట్పల్లిలో టైలర్గా పనిచేస్తున్నాడు. యూసుఫ్గూడ సమీపంలోని కార్మికనగర్లో ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో భార్య రుబీనా, కుమార్తె రుకీయా, కుమారుడు సుభాన్తో కలిసి ఉంటున్నాడు.
మార్చి 28న భార్య పిల్లలను తీసుకొని శ్రీరాంనగర్లో ఉంటున్న పుట్టింటికి వెళ్లింది. సిద్దిఖ్ రోజూ విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అత్తింట్లో వెళ్లి భోజనం చేసేవాడు. బుధవారం రాత్రి కూడా అక్కడ భోజనం చేసి ద్విచక్ర వాహనంపై అపార్ట్మెంట్కు చేరుకొని ఫ్లాట్లోకి వెళ్లాడు. గురువారం ఉదయం అతని ఫ్లాట్కు బయటి నుంచి తాళం వేసి ఉండటంతో విధుల్లోకి వెళ్లాడని అందరూ అనుకున్నారు. సాయంత్రం సమయంలో సిద్దిఖ్ ఫ్లాట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్మెంట్ యజమాని, స్థానికులతో కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు ఫ్లాట్ తెరిచి చూడగా వంట గదిలోని ఫ్రిడ్జి వద్ద సిద్దిఖ్ మృత దేహం పడి ఉంది. అతని కడుపులో కత్తితో పొడవటంతో పాటు తల మీద బలమైన వస్తువుతో బాదినట్లు ఆనవాళ్లు లభించాయి. సిద్దిఖ్ను చంపిన తర్వాత కర్టెన్లో పెట్టి తరలించేందుకు ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. ఫ్రిడ్జిలో పెట్టేందుకు ప్రయత్నించాడు. అతనిది భారీ శరీరం కావడంతో కుదరలేదు. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి బయటి నుంచి తాళం వేసి నిందితుడు పారిపోయాడు.