పెళ్లయిన సరిగ్గా ఏడాదికి యువకుడి మరణం.. పెళ్లి రోజు అతనికి ఆ బహుమతి ఎవరిచ్చారంటే?

ABN , First Publish Date - 2022-05-24T09:20:47+05:30 IST

ఎవరైనా పెళ్లయిన తొలి యానివర్సరీని సంతోషంగా గడపాలని అనుకుంటారు. కానీ ఆ యువతి మాత్రం మొదటి యానివర్సరీ రోజునే భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. తనకు మామ వరసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, దానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డుతొలగించుకోవాలని...

పెళ్లయిన సరిగ్గా ఏడాదికి యువకుడి మరణం.. పెళ్లి రోజు అతనికి ఆ బహుమతి ఎవరిచ్చారంటే?

ఎవరైనా పెళ్లయిన తొలి యానివర్సరీని సంతోషంగా గడపాలని అనుకుంటారు. కానీ ఆ యువతి మాత్రం మొదటి యానివర్సరీ రోజునే భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. తనకు మామ వరసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, దానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. 


రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన రేషంతా గుర్జార్ అనే యువతికి ఏడాది క్రితం ఓంప్రకాష్ అనే యువకుడితో వివాహమైంది. అయితే ఆమెకు తల్లి తరఫు నుంచి మామ వరుసయ్యే ధరమ్‌వీర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నెల 15న పెళ్లి యానివర్సరీ సందర్భంగా పెద్ద ప్లాన్ వేసిన ఆమె తన భర్తను హతమార్చింది. నిద్ర పట్టటం లేదని చెప్పి భర్త చేత నిద్ర మాత్రలు తెప్పించిందామె. 


వంట చేసే సమయంలో కూరలో ఆ మాత్రలు కలిపి భర్త, అత్తకు పెట్టింది. వాళ్లిద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రేమికుడికి ఫోన్ చేసింది. అతను వచ్చి గొడ్డలితో ఓంప్రకాష్ గొంతుపై దాడి చేసి చంపేశాడు. అతన్ని చంపేసిన తర్వాత ధరమ్‌వీర్ తన బండిపై ఊరికి వెళ్లిపోగా.. రేషంతీ కూడా ప్రశాంతంగా వెళ్లి తన గదిలో పడుకుంది. ఉదయాన్నే బయటకు వచ్చే ఓంప్రకాష్ ఎవరినీ కలవకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటికి వచ్చిన కొందరికి అతను మరణించినట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కేవలం 12 గంటల్లోనే హత్య చేసింది భార్యేనని తేల్చారు. రేషంతి, ధరమ్‌వీర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.


Updated Date - 2022-05-24T09:20:47+05:30 IST