ఇంటికి రాలేదని ఫిర్యాదు... Bladeతో తనకు తానే ఇలా...
ABN , First Publish Date - 2021-11-27T19:24:19+05:30 IST
నందిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 30 ఏళ్ల వ్యక్తి బ్లేడుతో తన చేతిని మణికట్టు, గొంతును కట్ చేసుకున్నాడు. తాజాగా అతని భార్య మూడు రోజులుగా తన భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఘజియాబాద్ : నందిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 30 ఏళ్ల వ్యక్తి బ్లేడుతో తన చేతిని మణికట్టు, గొంతును కట్ చేసుకున్నాడు. తాజాగా అతని భార్య మూడు రోజులుగా తన భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఓంప్రకాష్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అతనికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఓం ప్రకాష్ దంపతులకు ఒక బాబు, పాప ఉన్నారు. వీరు నందిగ్రాం ప్రాంతంలో నివాసముంటున్నారు.
కాగా.. గత మూడేళ్లుగా ఓం ప్రకాష్.. వేరొక మహిళతో వివాహేతర సబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలవుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇటీవల భార్యాభర్తల పెద్ద యుద్ధమే జరగడంతో ఓం ప్రకాష్ ఇల్లు విడిచి పోయాడు. మూడు రోజులు అయినా ఇంటి మొహం చూడకపోవడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో ఉంటున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ అవినాష్ కుమార్ తెలిపారు.
అతని అన్నయ్యను సహకారంతో పోలీసులు ఓం ప్రకాష్ను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. తమ పక్కింట్లో ఉంటున్న మహిలతో తాను ఉండాలనుకుంటున్నానని కానీ తన భార్య తరచూ గొడవపడుతోందని పోలీసులకు చెప్పాడు. అంతలోనే సడెన్గా తన షూ నుంచి బ్లేడ్ తీసి మణికట్టు కట్ చేసుకున్నాడు. పోలీసులు అతన్ని వారించబోతుండగానే గొంతును కూడా కట్ చేసుకున్నాడు. తానిక తన భార్యతో కలిసి ఉండలేనని ఓం ప్రకాష్ చెప్పినట్టు పోలీసు అధికారి చెప్పారు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.