టిఫిన్ తీసుకురావడానికి వెళ్లిన భర్త.. అతను తిరిగి వచ్చే సరికి ఇంట్లో పరస్థితి చూసి షాక్!

ABN , First Publish Date - 2022-02-27T05:44:31+05:30 IST

పెళ్లి అనేది నమ్మకానికి మారుపేరు. చాలా మందికి అది ఓ మధుర జ్ఞాపకం. కానీ కొందరు మోసగాళ్లు దానిని కేవలం వ్యాపారంలా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ...

టిఫిన్ తీసుకురావడానికి వెళ్లిన భర్త.. అతను తిరిగి వచ్చే సరికి ఇంట్లో పరస్థితి చూసి షాక్!

పెళ్లి అనేది నమ్మకానికి మారుపేరు. చాలా మందికి అది ఓ మధుర జ్ఞాపకం. కానీ కొందరు మోసగాళ్లు దానిని కేవలం వ్యాపారంలా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. 


అయితే ఆమెకు అది వ్యాపారం. ఆమె ఇప్పటికి అలాంటి ఎన్నో పెళ్లిళ్లు చేసుకుని వరుడి కుటుంబాలను దోచుకుంది. పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టి, వీలు చూసుకుని అక్కడి డబ్బులు, నగలు తీసుకుని పారిపోవడం ఆమెకు అలవాటైన పని. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో మరొకరిని ఆమె మోసం చేసింది.


తాజాగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని  దల్పత్‌పురాకు చెందిన పుష్పా దేవి అనే మహిళను ఛతర్‌పూర్‌కు చెందిన సోనాలాల్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 10న వారి వివాహం జరిగింది. వివాహం అనంతరం 15 రోజుల పాటు పుష్ప, సోనాలాల్ సంతోషంగా తమ దాంపత్య జీవితం కొనసాగించారు.  భార్యపై ప్రేమతో సోనాలాల్ ఆమె అడిగిన ప్రతిదీ కొనిచ్చాడు. ఆమెకోసం బంగారు నగలు, ఖరీదైన మొబైల్ తీసుకువచ్చాడు.


ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్య కోసం సోనాలాల్ టిఫిన్ తెచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అతను తిరిగి వస్తుండగా పుష్ప మరొకరితో బైక్‌పై వెళ్లిపోవడం చూశాడు. వారిని ఆపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఇంటికి వెళ్లి చూసుకుంటే బీరువాలో ఉండాల్సిన బంగారు నగలు, డబ్బు కనిపించకుండా పోయాయి. అది చూసి సోనాలాల్ ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి పుష్పపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2022-02-27T05:44:31+05:30 IST