పెళ్లైన ఆరు నెలలకే యువకుడి ఆత్మహత్య.. అతని నిర్ణయం వెనుకున్న కారణమేంటో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-02-17T16:56:02+05:30 IST
అతనికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది.. అయితే పెళ్లి తర్వాత అతని భార్య కాపురానికి రాలేదు..
అతనికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది.. అయితే పెళ్లి తర్వాత అతని భార్య కాపురానికి రాలేదు.. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత గత సోమవారం ఆమె తొలిసారి అత్తింటికి వచ్చింది.. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది.. మళ్లీ తిరిగి రాలేదు.. సాయంత్రానికి అసలు విషయం బయటపడింది.. ఆమె తన ప్రేమికుడితో వెళ్లిపోయిందని తెలిసింది.. తీవ్రంగా హర్ట్ అయిన యువకుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
రాజస్థాన్లోని సిరోహీ గ్రామానికి చెందిన సోనారామ్ అనే యువకుడు గత ఏడాది ఆగస్టులో రేష్మ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే రేష్మ వివాహం తర్వాత అత్తింటికి వెళ్లకుండా ఆరు నెలలు పుట్టింట్లోనే ఉండిపోయింది. చివరకు గత సోమవారం సోనారామ్ ఇంటికి వెళ్లింది. ఆ రోజంతా అక్కడ ఉండి మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. సాయంత్రం అసలు విషయం తెలిసింది.
తన ప్రేమికుడు జావేద్తో రేష్మ వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో సోనారామ్ తీవ్రంగా బాధపడ్డాడు. పరువు పోయినట్టు భావించి రోజంతా తన గదిలో ఒంటరిగా గడిపాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్వేషించగా ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.