రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేదుటే భార్య మృతి
ABN , First Publish Date - 2022-07-05T07:18:58+05:30 IST
రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేదుటే భార్య మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మేడ్చల్, జూలై 4: రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేదుటే భార్య మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రిభువనగిరి జిల్లా రాజంపేట మండలం సింగన్నగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్-రజని దంపతులు హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై సింగన్నగూడెం నుంచి మేడ్చల్ మీదుగా మియాపూర్కు వెళ్తుండగా మేడ్చల్ చెక్పోస్టు వద్ద లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన రజనిపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాస్ రెండు కాళ్లు విరిగాయి.