భర్తకు కరోనా.. భార్య కన్నుమూత

ABN , First Publish Date - 2020-07-12T07:59:52+05:30 IST

భర్తకు కరోనా నిర్ధారణ కావడంతో మనోవేదనకు గురై భార్య చనిపోయింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తేరుబజారు సమీపాన ఉంటున్న దంపతుల్లో శుక్రవారం భర్తకు పాజిటివ్...

భర్తకు కరోనా.. భార్య కన్నుమూత

బుక్కరాయసముద్రం, జూలై 11: భర్తకు కరోనా నిర్ధారణ కావడంతో మనోవేదనకు గురై భార్య చనిపోయింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తేరుబజారు సమీపాన ఉంటున్న దంపతుల్లో శుక్రవారం భర్తకు పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్తను అంబులెన్స్‌లో ఐసొలేషన్‌కు తరలించిన రెండు గంటలకే భార్య కుప్పకూలిపోయి..అక్కడికక్కడే చనిపోయింది. కాగా, ఆమె కూడా వైరస్‌ బారిన పడినట్లు వైద్యాధికారులు శనివారం ఉదయం ప్రకటించారు. 


Updated Date - 2020-07-12T07:59:52+05:30 IST