కాపురంలో కలతలు.. భర్త ముందరే విషం తాగిన భర్త.. అప్పుడా భర్త ఆమెను కాపాడకుండా ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-03-17T08:36:04+05:30 IST

వారిద్దరికీ ఏడాది క్రితం వివాహం జరిగింది.. అయితే వారి వైవాహిక జీవితం అనుకున్నంత సంతోషంగా సాగడం లేదు.. ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ గొడవపడుతుండేవారు.. తాజాగా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.. దీంతో భర్త ఎదురుగానే భార్య విషం తాగేసింది..

కాపురంలో కలతలు.. భర్త ముందరే విషం తాగిన భర్త.. అప్పుడా భర్త ఆమెను కాపాడకుండా ఏం చేశాడంటే..

వారిద్దరికీ ఏడాది క్రితం వివాహం జరిగింది.. అయితే వారి వైవాహిక జీవితం అనుకున్నంత సంతోషంగా సాగడం లేదు.. ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ గొడవపడుతుండేవారు.. తాజాగా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.. దీంతో భర్త ఎదురుగానే భార్య విషం తాగేసింది.. ఆ తర్వాత భర్త కూడా విషం తాగేశాడు.. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. 


వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన జితేంద్ర అనే వ్యక్తి ఏడాది క్రితం ప్రీతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ప్రీతి గర్భం దాల్చింది. సోమవారం రాత్రి జితేంద్ర భోజనం చేస్తూ ఏదో విషయమై భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రీతి కూడా భర్తతో వాదించింది. ఆ తర్వాత తీవ్ర మనస్థాపానికి గురై భర్త ఎదురుగానే విషయం తాగేసింది. ఆ ఘటన చూసి షాకైన జితేంద్ర కూడా విషం తాగేశాడు. 


తామిద్దరం విషం తాగేశామని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. స్నేహితులు వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనలో ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. జితేంద్ర ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటున్నాడు. కాగా, జితేంద్రపై ప్రీతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2022-03-17T08:36:04+05:30 IST