ప్లాట్ విషయంలో భర్తతో గొడవపడి.. ఉరేసుకొని భార్య ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST
ప్లాట్ విషయంలో భర్తతో గొడవపడి.. ఉరేసుకొని భార్య ఆత్మహత్య
మేడ్చల్, జూలై 3 : ప్ల్లాట్ విషయంలో భర్తతో గొడవపడి క్షణికావేశంలో భార్య ఉరేసుకొని మృతిచెందిన ఘటన మేడ్చల్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనికి చెందిన అలుగువెల్లి నరేందర్రెడ్డి-రేణుక దంపతులు వృత్తిరీత్యా మేడ్చల్లోని రాఘవేంద్రనగర్ కాలనీలో లక్ష్మీనర్సింహ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, శనివారం రాత్రి ఓ ప్లాట్ విషయంలో భర్తతో గొడవపడిన రేణుక.. క్షణికావేశానికి గురై రూంలో ఫ్యాన్కు ఉరేసుకొని మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- కడుపునొప్పి భరించలేక యువకుడు..
మేడ్చల్, జూలై 3 : కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఉరివేసుకుని మృతిచెందిన ఘటన మేడ్చల్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపేట గ్రామానికి చెందిన టంటం శ్రీనివాస్ కొడుకు విష్ణువర్షన్(20) ఓ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, అతడికి మే నెలలో వివాహమైంది. అయితే, శనివారం రాత్రి విష్ణువర్ధన్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. దీంతో ఆ బాధను భరించలేక ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- లారీ క్యాబిన్లో ఉరేసుకొని డ్రైవర్..
ఘట్కేసర్ రూరల్, జూలై 3 : లారీ క్యాబిన్లో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, పెర్వాల్ గ్రామానికి చెందిన జి. సత్యనారాయణ(45) ఇసుక లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఇసుక లారీ ఘట్కేసర్, మైసమ్మగుట్ట సమీపంలోని వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో శనివారం రాత్రి పార్కింగ్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున సత్యనారాయణ లారీక్యాబిన్లో టవల్తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.