HYD : వేరే మహిళతో భర్త సహజీవనం.. ఇంట్లో ఉండగా రెడ్హ్యాండెడ్గా భార్య పట్టుకుని..!
ABN , First Publish Date - 2021-10-28T16:03:42+05:30 IST
మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్హ్యాండెడ్గా పట్టుకుని..
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్ : మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదిన సంఘటన కేపీహెచ్బీపీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాశ్కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణితో వివాహం జరిగింది. ప్రకాశ్ బంజారాహిల్స్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చార్టెడ్అకౌంటెట్గా పనిచేస్తున్నాడు. పెళ్లైన నెల రోజుల నుంచి భార్యను వదిలి దూరంగా ఉంటున్నాడు.
తర్వాత హైదరాబాద్లో కాపురం పెట్టాక భార్యను అకారణంగా హింసించేవాడు. రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఉండేవాడని బాధితురాలు తెలిపింది. బాధలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా ప్రకాశ్ పట్టించుకోలేదని ఆమె వాపోయింది. కొంతకాలంగా ప్రకాశ్ ఇంటికి రావడం మానేశాడు. తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో బుధవారం త్రివేణి తన కుటుంబ సభ్యులతో కలిసి కేపీహెచ్బీలోని ఓ ఇంటిలో ప్రకాశ్ మరో మహిళతో ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాశ్తో పాటు మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. బాధితురాలి నివాసం మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధి కావడంతో అక్కడ ఫిర్యాదు చేయాల్సిందిగా కేపీహెచ్బీ పోలీసులు సూచించారు. మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.