చంపేస్తానని చెప్పిన భార్య.. జోక్ అనుకున్న భర్త.. చివరకు జరిగింది ఏంటంటే..
ABN , First Publish Date - 2022-04-06T20:04:05+05:30 IST
వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలను చంపేస్తున్న మహిళల గురించి తరచుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి.
వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలను చంపేస్తున్న మహిళల గురించి తరచుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్లో ఇలాంటి హత్య వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ అనే వ్యక్తి 2016లో సీమ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటికే సీమ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం రోహిత్ను వివాహం చేసుకుంది. అయితే కొద్ది కాలం తర్వాత నరేంద్ర అనే యువకుడితో ప్రేమలో పడింది.
నరేంద్రను తన బంధువుగా భర్తకు పరిచయం చేసింది. దీంతో నరేంద్ర తరుచుగా సీమ ఇంటికి వెళ్లి అక్కడే ఆమెతో రొమాన్స్ సాగించేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ బలపడి రోహిత్ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు రాత్రి సీమ తన భర్త రోహిత్తో ఓ గేమ్ ఆడదామని చెప్పి బెడ్రూమ్లోకి పిలిచింది. చేతులు కట్టేసి శృంగారం సాగిద్దామని అడిగింది. రోహిత్ అంగీకరించడంతో అతడి చేతులను గట్టిగా కట్టేసింది. అనంతరం అతడి నోటిని ప్లాస్టర్తో మూసేసింది. చంపేస్తానని హెచ్చరించింది. అదేదో ఆట అనుకుని రోహిత్ పట్టించుకోలేదు.
కొద్ది సేపటి తర్వాత రోహిత్ కుడి చేతి నరాన్ని కత్తితో కోసేసింది. దాదాపు రెండు గంటల పాటు రక్తస్రావం జరగడంతో రోహిత్ మరణించాడు. అనంతరం బయటకు వెళ్లి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. కుడిచేతి వాటం కలిగిన రోహిత్ కుడిచేతి నరాన్ని ఎలా కట్ చేసుకుంటాడని అనుమానించారు. దీంతో సీమను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో సీమ నిజం అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.