పెళ్లి చేసుకున్న పదిరోజులకే భర్తను పొడిచి పొడిచి చంపిన భార్య.. ఎంత ప్లాన్ వేసిందంటే?

ABN , First Publish Date - 2022-04-13T08:59:38+05:30 IST

కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య.. ఏదో మొక్కు ఉందని చెప్పి తోడు రమ్మంటే వెళ్లాడా భర్త. ఆ నిర్ణయమే తనకు చావును తీసుకొస్తుందని ఊహించలేదు..

పెళ్లి చేసుకున్న పదిరోజులకే భర్తను పొడిచి పొడిచి చంపిన భార్య.. ఎంత ప్లాన్ వేసిందంటే?

కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య.. ఏదో మొక్కు ఉందని చెప్పి తోడు రమ్మంటే వెళ్లాడా భర్త. ఆ నిర్ణయమే తనకు చావును తీసుకొస్తుందని ఊహించలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో వెలుగు చూసింది. 


షమా పర్వీన్ అనే యువతికి 2015లో షహబుద్దీన్ అనే యువకుడితో వివాహమైంది. పెళ్లయిన పదిరోజుల తర్వాత 2015 మార్చి 7న మొక్కు ఉందని చెప్పి భర్తను తన వెంట బయటకు తీసుకెళ్లింది. దారి మధ్యలోనే తన ప్రియుడు సత్యేంద్ర ప్రజాపతితో కలిసి భర్తపై దాడి చేసింది. 


వెంట తెచ్చిన కత్తెర తీసుకొని భర్తను ఇష్టమొచ్చినట్లు పొడిచి పారేసింది. అతను చనిపోయే వరకు వాళ్లిద్దరూ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు. షహబుద్దీన్ ఊపిరి ఆగిపోగానే అతని శవాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న ఒక చెరువులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 


అయితే ఇంతకాలం తర్వాత కోర్టు వారిని దోషులుగా గుర్తించి ప్రేమికులిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తన బిడ్డకు ఆలస్యంగా అయినా సరే న్యాయం జరిగిందని షహబుద్దీన్ తండ్రి నూర్ హసన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


Updated Date - 2022-04-13T08:59:38+05:30 IST