Tragedy: ఒకరి వెంట ఒకరు..

ABN , First Publish Date - 2022-09-04T17:47:42+05:30 IST

అన్యోన్య దాంపత్యానికి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. మృత్యువులోనూ దంపతులు ఒక్కటైన సందర్భాలు అక్కడక్కడ మాత్రమే

Tragedy: ఒకరి వెంట ఒకరు..

- మృత్యువులోనూ ఒక్కటైన దంపతులు 

- విజయపుర, గదగ్‌ జిల్లాల్లో రెండు జంటల మృతి


బెంగళూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అన్యోన్య దాంపత్యానికి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. మృత్యువులోనూ దంపతులు ఒక్కటైన సందర్భాలు అక్కడక్కడ మాత్రమే సాధ్యమవుతాయి. ఒకేరోజు విజయపుర, గదగ్‌ జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయపుర జిల్లా(Vijayapura District) తికోట తాలూకా మలకనదేవరహట్టి గ్రామానికి చెందిన దేవేంద్ర శ్యామరాయ వళసంగ్‌ (105) వయోభారం, ఆరోగ్య సమస్యలతో శనివారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే ఆయన భార్య దుండవ్వ (87) కన్నుమూశారు. ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు పూర్తి చేశారు. గదగ్‌ తాలూకా(Gadag Taluka) కణిగినాళకు చెందిన ఈరవ్వ రామశెట్ర (65) ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఆమె శనివారం మృతి చెందారు. భార్య ఇక లేరనే విషయం తెలియడంతో దిగులు చెందిన భర్త సిద్దరామ రామశెట్ర (73) కూడా మృతి చెందారు. ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. 



Updated Date - 2022-09-04T17:47:42+05:30 IST