మొన్న భార్య.. నిన్న భర్త మృతి
ABN , First Publish Date - 2020-03-31T09:33:55+05:30 IST
ఏపీలో ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో మరణించారు. వైద్యాధికారులు మాత్రం ఇతర అనారోగ్య కారణాలవల్లే వీరు చనిపోయినట్లు తెలిపారు. వీరు ముగ్గురూ ఇటీవల ఢిల్లీలో జరిగిన
- ఢిల్లీ సభకు వెళ్లొచ్చాకే ఘటన
- ‘కరోనా’ను ధ్రువీకరించని వైద్యులు
విజయవాడ/కాకినాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఏపీలో ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో మరణించారు. వైద్యాధికారులు మాత్రం ఇతర అనారోగ్య కారణాలవల్లే వీరు చనిపోయినట్లు తెలిపారు. వీరు ముగ్గురూ ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారే. విజయవాడకు చెందిన మహిళ ఆదివారం మరణించగా, సోమవారం ఆమె భర్త కూడా చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లా కాతేరుకు చెందిన వ్యక్తి (62) సోమవారం రాత్రి చనిపోయాడు. ఆదివారం ఆయనకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో 14 రోజులు ఐసొలేషన్లో ఉన్న తర్వాత మళ్లీ పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పారు. అయితే సోమవారం రాత్రి హఠాత్తుగా చనిపోయారు.