రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

ABN , First Publish Date - 2021-06-15T05:09:42+05:30 IST

మండల పరిధిలోని పుల్లప్పగూడెం ప్రధాన రహ దారిపై సోమవారం జరిగిన ప్రమా దంలో భార్య భర్తలు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
గుత్త ప్రసాద్‌, భవాని (ఫైల్‌)

వారి ఒంటిపై 9 కాసుల బంగారం మాయం


కుక్కునూరు, జూన్‌ 14 : మండల పరిధిలోని పుల్లప్పగూడెం ప్రధాన రహ దారిపై సోమవారం జరిగిన ప్రమా దంలో భార్య భర్తలు మృతి చెందారు. మండలంలోని కొండపల్లికి చెందిన గుత్త ప్రసాద్‌ (48), గుత్త భవాని (44)  కొన్నేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారంలో నివ శిస్తున్నారు. మూడు రోజుల క్రితం వా రు కొండవల్లి వచ్చి వ్యాక్సిన్‌ వేయించు కుని తిరిగి వెళుతున్నారు. ద్విచక్ర వాహ నంపై వెళుతున్న వారిని ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఆ వేగానికి కారు కొంత దూరం వరకు వారిని లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపడిన వారిని సమీప అమరవరం ఆసుపత్రికి తర లించారు. అనంతరం 108 వాహనంలో భద్రాచలం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇది ఇలాఉండగా తీవ్రంగా గాయపడిన వారి ఒంటిపై దాదాపు 9 కాసుల బంగారం ఉండగా సంఘటన స్ధలానికి వచ్చిన కొందరు కాజేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. వారికికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2021-06-15T05:09:42+05:30 IST