పక్కింట్లో నుంచి భార్య రావడం గమనించిన భర్త.. ఎందుకెళ్లావని నిలదీస్తే రచ్చ రచ్చ.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..!
ABN , First Publish Date - 2021-12-22T21:20:36+05:30 IST
ఆ భర్త ప్రతిరోజు విధులకు వెళ్లేవాడు. భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. అయితే ఓ రోజు పనికి వెళ్లిన భర్త
భోపాల్: ఆ భర్త ప్రతిరోజు విధులకు వెళ్లేవాడు. భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. అయితే ఓ రోజు పనికి వెళ్లిన భర్త తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. కాసేపయ్యాక పక్కింట్లో నుంచి ఆమె రావడాన్ని అతడు గమనించాడు. వాళ్లింటికి ఎందుకెళ్లావని నిలదీస్తే ఆమె రచ్చ రచ్చ చేసింది. దీంతో తెల్లారేసరికి అక్కడ షాకింగ్ సీన్ కనిపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..
ఉమ్రాయి గ్రామానికి చెందిన 40 ఏళ్ల శంకర్లాల్ రాజ్పుత్కు సీమ రాజ్పుత్తో గతంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే శంకర్లాల్ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లల బాగోగులు చూసుకునేది. అయితే సీమకు పక్కింట్లో ఉండే 43 ఏళ్ల గోస్వామితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భర్త ఇంట్లో లేని సమయంలో సీమ తరచూ ప్రియుడి ఇంటికి వెళ్తూ వచ్చేది కానీ ఏ రోజూ భర్త కంటపడలేదు.
అయితే ఈ నెల 17న శంకర్లాల్ ఇంట్లో లేని సమయంలో సీమ గోస్వామి ఇంటికి వెళ్లింది. అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. అయితే అతడికి ఇంట్లో భార్య కనిపించలేదు. కొద్ది సేపటికే సీమ గోస్వామి ఇంట్లో నుంచి రావడం అతడు గమనించాడు. అపుడు భార్యను శంకర్లాల్ వాళ్లింటికి ఎందుకెళ్లావ్? అని నిలదీశాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ మొదలైంది. అదే రోజు మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అపుడు సీమ ప్రియుడు గోస్వామి ఇద్దరి మధ్యకు వచ్చాడు. భార్య, ఆమె ప్రియుడు కలిసి శంకర్లాల్పై దాడికి దిగారు. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శంకర్లాల్ ఈ నెల 19న చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం బుధవారం ఉదయం సీమను, ప్రియుడు గోస్వామిని అరెస్టు చేశారు.