ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి
ABN , First Publish Date - 2022-08-14T05:51:09+05:30 IST
ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి
షాద్నగర్ అర్బన్, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కార్యకర్తలకు సూచించారు. స్థానిక సాయిరాజా ఫంక్షన్ హాలులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్ అధ్యక్షతన శనివారం టీఆర్ఎస్ ఫరూఖ్నగర్ మండల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం రూ.17లక్షల 42వేలు విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్చైర్మన్ గణేష్, ఎంపీపీ ఖాజా ఇద్రీష్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సింగిల్విండో చైర్మన్ బక్కన్నయాదవ్ పాల్గొన్నారు.