పే స్లిప్‌కి ఎందుకు డిజైన్ చేశారు: సూర్యనారాయణ

ABN , First Publish Date - 2022-02-02T01:47:08+05:30 IST

పే స్లిప్‌కి కొత్త పద్ధతిలో ఎందుకు డిజైన్ చేశారని ప్రభుత్వాన్ని ఉద్యోగ

పే స్లిప్‌కి ఎందుకు డిజైన్ చేశారు: సూర్యనారాయణ

అమరావతి: పే స్లిప్‌కి కొత్త పద్ధతిలో ఎందుకు డిజైన్ చేశారని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ప్రశ్నించారు. పే స్లిప్‌లో జీతం పడినట్టు చెప్పి బ్యాంక్‌లో డబ్బు జమకాలేదన్నారు. మెసేజ్‌ వచ్చిన ఏ ఉద్యోగికి ఖాతాలో జీతం పడలేదన్నారు. స్టీరింగ్ కమిటీ మూడు డిమాండ్లు అసంబద్ధమని సజ్జల ఫోన్‌లో చెప్పారని ఆయన పేర్కొన్నారు. వాటిపై స్పందించలేమన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు పే స్లిప్‌లను ఎవరి ఆఫీసుల ఎదుటు వారు తగలబెట్టాలని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-02T01:47:08+05:30 IST