తెలంగాణపై బీజేపీకి ఎందుకింత అక్కసు
ABN , First Publish Date - 2022-05-17T05:37:45+05:30 IST
తెలంగాణపై బీజేపీకి ఎందుకింత అక్కసు
ఆమనగల్లు, మే 16: తెలంగాణపై బీజేపీ నాయకులకు ఎందుకింత అక్కసు అని ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివా్సరెడ్డి, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావులు ప్రశ్నించారు. పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకుండా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి దిశలో అడుగులు వేస్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అలజడులకు ఆజ్యం పోస్తున్నారని అన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ సర్కార్ కక్షపూరిత ధోరణి వీడకుంటే ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. తుక్కుగూడ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తమ స్థాయిని దిగజారి వ్యవహరించారని, అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ తరహా పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.