ఎనలేని గౌరవముంటే పేరెందుకు మార్చారు?

ABN , First Publish Date - 2022-09-23T08:24:13+05:30 IST

ఎనలేని గౌరవముంటే పేరెందుకు మార్చారు?

ఎనలేని గౌరవముంటే పేరెందుకు మార్చారు?

దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం

విశాఖపట్నం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. పెట్టుబడులు రావడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఎన్టీఆర్‌పై ఎనలేని గౌరవముందని  చెబుతున్న సీఎం జగన్‌.. హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేయడం సబబు కాదన్నారు. ఎన్టీఆర్‌పట్ల బీజేపీకి అపార గౌరవం ఉందని, అకారణంగా ఆయన పేరు తీసేయడాన్ని అవమానంగానే భావిస్తున్నామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. విశాఖలో ఆర్‌కే బీచ్‌కు జగన్‌ బీచ్‌ అని పేరు పెడతారా అని ప్రశ్నించారు. రుషికొండకు ‘జగన్‌ కొండ’ అని పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 2024లో జగన్‌ మళ్లీ అధికారంలోకి రారని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-09-23T08:24:13+05:30 IST