‘కిరీటం’ ధరించి ఆసక్తి రేపిన విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ

ABN , First Publish Date - 2022-08-29T01:13:13+05:30 IST

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ (Daren Sammy)కి ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. 2016లో భారత్‌లో జరిగిన

‘కిరీటం’ ధరించి ఆసక్తి రేపిన విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ

న్యూఢిల్లీ: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ (Daren Sammy)కి ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. 2016లో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో డారెన్ సమీ నేతృత్వంలోని కరీబియన్ జట్టు అద్భుత ఆటతీరుతో ట్రోఫీని ఎగరేసుకుపోయింది. సమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా భారత్‌లోనే ఆడాడు. గతేడాది ఓ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. స్పోర్ట్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా క్రికెట్‌తో తన అనుబంధాన్ని ఎన్నో రకాలుగా కొనసాగించాడు. 


డారెన్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి నెటిజన్లను ఆలోచనలో పడేసింది. ఆసక్తికరమైన ఫొటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ ఫొటోలో సమీ తలకు కిరీటం ధరించి మహారాజులా చిరునవ్వుతో కనిపించాడు. అయితే, ఈ ఫొటో వెనకున్న మర్మం మాత్రం తెలియరాలేదు. ఇండియా తన రెండో ఇల్లని సమీ తరచూ చెబుతుంటాడు. కాబట్టి అతడు ఇక్కడేమైనా సెకండ్ కెరియర్ కోసం ప్లాన్ చేస్తున్నాడా? బాలీవుడ్‌లో లేదంటే, ఓటీటీలో ప్రవేశించబోతున్నాడా? అన్న ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు డారెన్ సమీ ఎప్పుడు తెరదించుతాడో చూడాల్సిందే!

Updated Date - 2022-08-29T01:13:13+05:30 IST