‘ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేస్తే ఊరుకోం’

ABN , First Publish Date - 2020-06-07T16:56:24+05:30 IST

పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో మాజీ సీఎం చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని..

‘ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేస్తే ఊరుకోం’

అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో మాజీ సీఎం చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. అంతా పారదర్శకంగా జరుగుతుంటే ఏదో జరిగిపోతున్నట్టు ఊహాగానాలు చేస్తున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల కోసం లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరమని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. డబ్బులు వసూలు చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు సర్వీసులపై అధికారులతో చర్చలు జరుతున్నామని తెలిపారు.

Updated Date - 2020-06-07T16:56:24+05:30 IST